ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరియా వాడకంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 02:04 PM

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అందించే ప్రోత్సాహకాలను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు.సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర జీఎస్‌డీపీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాలను సమర్థంగా నిర్వహించి ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసినప్పటికీ, ఎరువుల శాఖలో మార్పులు చేయలేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.రబీ సీజన్‌లో యూరియా కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ-క్రాప్ డేటా ఆధారంగా ప్రతి రైతుకు అవసరమైన యూరియా పరిమాణాన్ని గుర్తించాలని, అవసరమైతే ఆధార్ అనుసంధానంతో ఇంటికే ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa