ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యని ప్రభుత్వానికి తెలియజేస్తే ఐఫోన్‌ను బహుమతిగా ఇస్తా

national |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:41 PM

బెంగళూరులో గుంతలమయమైన రోడ్ల సమస్య మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి అధికారులు స్పందించకపోవడంతో విసిగిపోయిన ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చేయగలిగిన వారికి సరికొత్త ఐఫోన్‌ను బహుమతిగా ఇస్తానంటూ వినూత్న ఆఫర్ ప్రకటించారు. ఈ ఘటనతో నగరంలో పౌర సమస్యల తీవ్రత మరోసారి వెలుగులోకి వచ్చింది. శిఖర్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు తన నివాస ప్రాంతంలోని అధ్వానమైన రోడ్ల ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "గత మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ప్రజలు ఆశలు వదిలేసుకున్నారు. ట్విట్టర్‌లో ఎవరైనా సరే, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేలా చేయగలిగితే వారికి నేను వ్యక్తిగతంగా ఐఫోన్ కొనిస్తాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తూ, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ విషయంపై క్యాపిటల్‌మైండ్ సీఈవో దీపక్ షెనాయ్ కూడా స్పందించారు. "పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ఇప్పుడు ఎస్‌యూవీలు కూడా ఈ రోడ్లపై వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇది నేను నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఉంది. బీబీఎంపీ కమిషనర్ దయచేసి ఈ సమస్యను పరిశీలించాలి" అని ఆయన కోరారు. గత నాలుగు నెలలుగా నగరంలోని ప్రముఖులు రోడ్ల దుస్థితిపై గళమెత్తుతున్నా అధికారుల నుంచి స్పందన కరవైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa