ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం కుంభకోణంలో నిజాలు త్వరలోనే బయటికి వస్తాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 04:08 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోందని, త్వరలోనే అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో బెల్టుషాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వం అంతా మంచి చేసిందని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ‘‘గత ఐదేళ్లలో నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది, నిజానిజాలు త్వరలో తేలుతాయి’’ అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa