ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ మార్పులతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 01:55 PM

జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. వారి పొదుపు కూడా మెరుగుపడుతుందన్నారు. గురువారం అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీఎస్టీ 2.0 నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ సంస్కరణల ద్వారా దేశ ప్రగతికి బాటలు వేశారని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ అంశంలో రాష్ట్రం తరఫున నిర్మాణాత్మక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల విధానం సులభతరం కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పన్నులు తగ్గడం వల్ల ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుందని, అది ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి నెల రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పయ్యావుల ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa