ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 24న పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 04:47 PM

సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన పాలకొల్లు రానున్నారు. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పాలకొల్లులోని బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఉన్న కళ్యాణ వేదికకు సమీపంలో ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు.ఈ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న కలెక్టర్ నాగరాణి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన ప్రణాళిక, బందోబస్తుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సాఫీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడాలని ఆమె ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa