ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తాము ప్రాధాన్యమిస్తామన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం తానే స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమై.. అన్ని సమస్యలను వారితో సమగ్రంగా చర్చిస్తానని పేర్కొన్నారు. అయితే వారికి సంబంధించి అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా.. మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో.. తాను అర్థం చేసుకోగలనని వివరించారు. వీరి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేక పోతున్నానన్నారు. ఆ క్రమంలో మత్స్యకారుల సమస్యలపై తాను నేరుగా చర్చించలేక పోతున్నానని వివరించారు. కానీ వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తున్నామన్నారు. మత్స్యకారులు.. ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని వాటి పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa