రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతిలో సీఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు చేపట్టారన్నారు. రాజధాని కోసం 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా తీసుకున్నామని వెల్లడించారు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు. అమరావతిలో చెట్లు తొలగించేందుకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వివరించారు.ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణం జరుగుతుందన్నారు. గత రెండు నెలలుగా వర్షాల వల్ల అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం 10 వేల మంది కార్మికులు అమరావతి పనుల్లో పాల్గొంటున్నారని.. మార్చి 31 నాటికి 3500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ,అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో టెండర్ నిబంధనలు పెట్టామని మంత్రి నారాయణ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa