ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా జీవీఎంసీ రహదారి విస్తరణ, మురుగునీటి పారుదల వ్యవస్థపై ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రశ్నించారు. జీవీఎంసీలో విలీనం అయిన గ్రామాల్లో సరైన మౌళిక సదుపాయాలు లేవన్నారు. రోడ్లు, డ్రైనేజీ కనెక్టివిటీకి సమగ్రమయిన ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనకాపల్లి జోన్కు 300 కాలేజీలు ఉన్నాయని.. మున్సిపాలిటీలు ప్రతిచోట ఊరు బయట ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. అనకాపల్లిలో మున్సిపల్ ఆఫీసులోనే డంపింగ్ యార్డు ఉందని దాన్ని మార్చాలని అన్నారు. మున్సిపల్ ఆఫీసు ఊరు మధ్యలో ఉంటుంది గనుక అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ , మున్సిపల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరారు.కావాలంటే వాటిని పీపీపీ కింద నిర్మించినా సరిపోతుంది అభిప్రాయపడ్డారు. జోనల్ కమిషనర్లకు అధికారం ఇవ్వాలని.. వారికి శాంక్షనింగ్ అథారిటీ ఇస్తే పనులు ముందుకు వెళతాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తరువాత మంత్రి నారాయణనే ఎక్కువ కష్టపడుతున్నారని అన్నారు. అనకాపల్లిలో ఆల్టర్నేటివ్ స్ధలాలు చూపించామని.. అధికారులు అంగీకరిస్తే మార్చొచ్చని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa