కర్నూల్ జిల్లాలో ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎస్ఆర్ అకాడమీ డైరెక్టర్ కొండ ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు. జీవో నెంబర్ 13ను వెంటనే అమలు చేసి, రిక్రూట్మెంట్ పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యనభ్యసించిన అభ్యర్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa