ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మెప్మాలు రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారుల అభివృద్ధికి స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే వీరి కోసం లోక్ కల్యాణ్ మేళాను తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారులను వివిధ పథకాలతో కలుపుతారు.. ఈ మేళాతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్న 10,751 మంది వీధి వ్యాపారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
వీధి వ్యాపారాలకు మేళాలో వారి అర్హత ప్రకారం 8 పథకాలను అనుసంధానం చేస్తారు. వారికి గుర్తింపు, ఆరోగ్య కార్డులు ఇస్తారు. ఏలూరు జిల్లాలో 2,127 మంది వీధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు చేయడం లేదు.. వారికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు. గతంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో రుణాలు తీసుకోవడానికి అర్హులైన వారిని గుర్తించారు. ఈసారి రుణ పరిమితిని పెంచారు.. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇస్తారు. 7 శాతం వడ్డీతో ఈ రుణాలు ఇస్తారు.
గతంలో జిల్లాలో 6,748 మందిని రుణాలకు అర్హులుగా గుర్తించారు. వారికి 7 శాతం వడ్డీతో రుణాలు ఇస్తారు. ఇంతకు ముందు రూ.10 వేలు ఉన్న రుణం ఇప్పుడు రూ.15 వేలకు పెరిగింది. గతంలో రూ.10 వేలు తీసుకొని చెల్లించిన వారికి ఇప్పుడు రూ.25 వేలు ఇస్తారు. అలాగే రూ.20 వేలు తీసుకొని బాకీ తీర్చిన వారికి రూ.50 వేలు ఇస్తారు. జిల్లాలోని వీధి విక్రయదారులు, హోటళ్ల నిర్వాహకులకు మెలకువలు నేర్పించేందుకు మేళాలు జరగనున్నాయి. ఈ మేళాలు నూజివీడులో ఇవాళ నిర్వహించారు.
మొత్తం 988 మందికి శిక్షణ ఇస్తారు. ఇందులో ఏలూరులో 430, జంగారెడ్డిగూడెంలో 351, నూజివీడులో 207 మంది ఉన్నారు. వీధి వ్యాపారులు హోటల్స్లో తయారుచేసే ఆహార పదార్థాలు రుచికరంగా, శుభ్రంగా ఉండేలా చూస్తారు.. ఈ మేళాలో శిక్షణ ఇస్తారు. మెప్మా పీడీ పి.మాధవి ఈ విషయాన్ని తెలిపారు. ఈ మేళాను 27న చింతలపూడిలో, ఈ నెల 29న ఏలూరు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో నిర్వహిస్తారు. ఎవరైనా అర్హులు ఉంటే మేళాకు హాజరుకావొచ్చని మెప్మా అధికారులు తెలిపారు. 'ఒకవేళ సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే వడ్డీగా చెల్లించిన నగదును రాయితీ రూపంలో తిరిగి పొందే అవకాశం' ఉంది అంటున్నారు. వీధి వ్యాపారుల్లో ఎవరైతే లోన్ తీసుకున్న డబ్బులు సక్రమంగా తిరిగి చెల్లిస్తారో వాళ్లకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే UPIతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డులు ఇస్తారు. వీధి వ్యాపారులు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అంటున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa