ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌లో మహిళల అభివృధే ధ్యేయంగా ఎన్డీయే ప్రభుత్వం కొత్త పథకం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 05:13 PM

బీహార్‌లో మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 10,000 చొప్పున జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి మొత్తం రూ. 7,500 కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేశారు.ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పాట్నాలో జరగ్గా, ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పాట్నాలోని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు లబ్ధిదారులతో ముచ్చటించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరవడం వల్లే ఇప్పుడు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేయగలుగుతున్నామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. "ఒకప్పుడు కేంద్రం 100 రూపాయలు పంపిస్తే, ప్రజలకు చేరేసరికి 15 రూపాయలే మిగిలేవని ఓ మాజీ ప్రధాని చెప్పారు. కానీ ఈ రోజు, ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతోంది" అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa