ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనసభలో ప్రజాప్రతినిధుల హాజరుపై ఫేషియల్ రికాగ్నిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 05:09 PM

ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికాగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా సభలో సభ్యులు తమ సీట్లలో కూర్చోగానే, వారి ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. ఈ హాజరు నివేదిక నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు చేరనుండటం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన డ్యురాంక్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ టెక్నాలజీ కోసం సభలో ప్రత్యేకంగా పాన్, టిల్ట్, జూమ్ (పీటీజెడ్) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రతి సభ్యుడి ముఖానికి సంబంధించిన 175 వెక్టార్ పాయింట్లను కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. అనంతరం సభలో ఏర్పాటు చేసిన కెమెరా 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ గంటకోసారి సభ్యుల ఫొటోలను తీసి సర్వర్‌కు పంపుతుంది. ఆ ఫొటోలను ముందుగా రికార్డ్ చేసిన డేటాతో సాఫ్ట్‌వేర్ పోల్చి, ఎవరు హాజరయ్యారు, ఎవరు గైర్హాజరయ్యారు అనే జాబితాను క్షణాల్లో సిద్ధం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa