స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. రుసుములు పెంచుతున్నట్లు తెలిపింది. ఫీ స్ట్రక్చర్, ఇతర ఛార్జీలను సవరించినట్లు నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. ఎడ్యుకేషన్ సంబంధిత పేమెంట్లు, వాలెట్ లోడింగ్ వంటి ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్లకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు తప్పనిసరిగా కొత్త ఛార్జీల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంచిత అదనపు ఛార్జీలను తప్పించుకునేందుకు ఫీ స్ట్రక్చర్ కచ్చితంగా తెలుసుకోవాలి.
థర్డ్ పార్టీ యాప్స్తో ఎడ్యుకేషన్ పేమెంట్స్
క్రెడ్, చెక్, మొబి క్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ సంబంధిత పేమెంట్లపై కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ట్రాన్సాక్షన్ అమౌంట్లో 1 శాతం ఫీ ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. అయితే నేరుగా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలకు నేరుగా పీఓఎస్ ద్వారా పేమెంట్లు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది.
వాలెట్ లోడింగ్ చేసేవారికి షాక్. రూ.1000 దాటి వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్లు చేస్తే 1 శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఛార్జీ పడుతుంది. ఎంపిక చేసిన మెర్చంట్ కోడ్స్ పరిధిలోని ట్రాన్సాక్షన్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. థర్డ్ పార్టీ మెర్చంట్స్కు చెందిన ఎడ్యుకేషన్ పేమెంట్ల ఛార్జీలను మెర్చంట్ కేటగిరీ కోడ్ ఎంసీసీ 8211, 8220, 8241, 8244, 8249, 8299గా తెలిపింది.
ఎస్బీఐ కార్డ్ ఇతర ఛార్జీలు
క్యాష్ పేమెంట్స్, చెక్ పేమెంట్స్, కార్డ్ రీప్లేస్మెంట్, లేట్ పేమెంట్ వంటి వివిధ సేవలకు ఫీ, ఛార్జీలు వసూలు చేస్తోంది ఎస్బీఐ కార్డ్. అయితే, ఆయా ట్రాన్సాక్షన్ల ఛార్జీలను ప్రస్తుతానికి మార్చలేదు. ప్రస్తుతానికి క్యాష్ పేమెంట్ ఫీ రూ.250గా ఉంది. అలాగే పేమెంట్ ఆలస్యమేతం 2 శాతం ఛార్జీలు పడతాయి. కనీసం రూ.500 ఉంటుంది. చెక్ పేమెంట్ ఛార్జీలు రూ.200గా ఉంటాయి.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు ఎస్బీఐ ఏటీఎంలలో, ఇతర డొమెస్టకి ఏటీఎంలలో 2.5 శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉంటుంది. ఇది కనీసం రూ.500గా ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ ఏటీఎంలలో క్యాష్ అడ్వాన్స్ ఫీజు 2.5 శాతంగా ఉంటుంది.
ఇక కార్డ్ రీప్లేస్మెంట్ ఫీజు అనేది రూ.100 నుంచి రూ.250 మధ్య ఉంటుంది. ఇక ఆరమ్ కార్డ్ విషయంలో ఇది రూ. 1500 వరకు ఉంటుంది. ఇక విదేశాల్లో ఎమర్జెన్సీగా కార్డ్ రీప్లేస్మెంట్ కనీస ఛార్జీ వీసా కార్డులకు 175 డాలర్లుగా ఉంటుంది. ఇక మాస్టర్ కార్డులకు 148 డాలర్లుగా ఉంటుంది. లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.500 వరకు ఉండవు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు రూ. 400 ఛార్జీలు ఉంటాయి. ఇక రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అయితే రూ.750 వరకు ఉంటుంది. రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు రూ. 950 వరకు ఉంటుంది రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రూ.1100 వరకు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa