ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటున్న సనా మీర్

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 02:33 PM

పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి, వ్యాఖ్యాత సనా మీర్ తన 'ఆజాద్ కశ్మీర్' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది. మహిళల ప్రపంచకప్ 2025 క్వాలిఫయర్స్‌లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సనా మీర్ కామెంటేటర్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ.. "నటాలియా పర్వేజ్ కశ్మీర్ నుంచి వచ్చింది... ఆజాద్ కశ్మీర్ నుంచి" అని వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్‌లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే, లైవ్ మ్యాచ్‌లో 'ఆజాద్ కశ్మీర్' (పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ పిలుచుకునే పేరు) అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa