మహారాష్ట్రలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత వ్యాపార గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తిని, అతడి ఇద్దరు పసిబిడ్డల కళ్లెదుటే అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేశారు. ఈ ఘోరం చూసిన ఆ చిన్నారులు భయంతో బిక్కచచ్చిపోయారు. బుధవారం ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో జరిగిన ఈ అమానవీయ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సయ్యద్ ఇమ్రాన్ షఫీక్ అనే వ్యక్తి తన 3, 13 ఏళ్ల కుమారులతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. సిల్క్ మిల్ కాలనీ ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, ఒక కారు వారి ఆటోను అడ్డగించింది. కారులో నుంచి దిగిన ఐదారుగురు దుండగులు, షఫీక్తో పాటు అతడి ఇద్దరు పిల్లలను బలవంతంగా ఆటోలో నుంచి బయటకు లాగారు.అనంతరం, ఆ చిన్నారులు చూస్తుండగానే షఫీక్పై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో షఫీక్ వారి నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అత్యంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులు మొదట అతడి వేళ్లను నరికేశారు. ఆ తర్వాత కుడి చేతి మణికట్టును కోసి, తల, మెడపై విచక్షణారహితంగా కొట్టారు. చివరగా కత్తులతో పలుమార్లు పొడిచి, సమీపంలోని ఫుట్ ఓవర్బ్రిడ్జి కింద పడేసి వెళ్లిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గ్యాస్ వ్యాపారంలో ఉన్న గొడవల కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేవలం 9 గంటల వ్యవధిలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa