భారత్లో చాలా మంది ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అందులోనూ నేరుగా బంగారు నగలు, నాణేలు, కడ్డీల వంటి భౌతిక బంగారం కొంటుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.20 లక్షలు దాటింది. గత ఏడాది కాలంలోనే 50 శాతానికి పైగా పెరిగింది. ఈ క్రమంలో మోసాలు సైతం పెరుగుతున్నాయి. కనిపించని విధంగా బంగారం స్వచ్ఛతను తగ్గించి మోసాలు చేస్తుంటారు. దీంతో నష్టపోవాల్సి వస్తుంది. అందులో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంటున నగ స్వచ్ఛతను తనిఖీ చేయాలి.
అయితే, చాలా మందికి బంగారం స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో తెలియదు. మన దేశంలో బంగారం ప్యూరిటీని దానిపై ఉండే హాల్ మార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ హాల్ మార్క్ వేస్తుంది. 2021, జూన్ 16 నుంచి బంగారు నగలపై హాల్ మార్క్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని 361 జిల్లాల్లో ఈ నిబంధన అమలులోకి తెచ్చింది. అంటే 2021 తర్వాత కొనుగోలు చేసే ప్రతి నగకు హాల్ మార్క్ అనేది ఉండాల్సింది. హాల్ మార్క్ ఉపయోగించి బీఐఎస్ వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. ఆ నగ స్వచ్ఛత, బరువు, ధర వంటి వివరాలు ఉంటాయి. మరోవైపు.. బీఐఎస్ గుర్తింపు పొందిన అస్సేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్స్ లోనూ ప్యూరిటీ తనిఖీ చేయవచ్చు. కొంత ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.
బీఐఎస్ కేర్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన గోల్డ్ జువెలరీ ప్యూరిటీని తనిఖీ చేయవచ్చు. ప్రతి బంగారం నగకు బీఐఎస్ 6 అంకెల యూనిక్ నంబర్ HUIDని జారీ చేస్తుంది. ఈ నంబర్ను నగపై ప్రింట్ చేస్తారు. మీరు బీఐఎస్ కేర్ యాప్లోకి వెళ్లి వెరిఫై హెచ్యూఐడీ ఆప్షన్ ద్వారా చెక్ చేయవచ్చు. హాల్ మార్క్ నంబర్ ఎంటర్ చేయడంతో బంగారు నగల వివరాలు కనిపిస్తాయి. మీరు ఆ నగ కొనుగోలు చేసే ముందే తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఏహెచ్సీ కేంద్రాల్లోనూ నగల ప్యూరిటీ తెలుసుకోవచ్చు. ఒక్కో నగకు రూ.45 ఛార్జ్ చేస్తారు. ఒక లాట్కు కనీస ఛార్జీ రూ.200గా నిర్ణయించారు.
ప్యూరిటీలో తేడా ఉంటే ఎలా?
హాల్ మార్క్ ఉన్న బంగారు నగ కొనుగోలు చేసినప్పటికీ దాని ప్యూరిటీ తక్కువగా ఉంటే నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో కొనుగోలుదారుకు పరిహారం చెల్లిస్తారు. నగల ప్యూరిటీలో ఎంత తక్కువగా లెక్కిస్తే దానికి రెండు రెట్లు పరిహారం కింద పొందవచ్చు. అలాగే టెస్టింగ్ ఛార్జీలు సైతం రీఫండ్ చేస్తారు. అనుమానం ఉంటే ఏహెచ్సీ కేంద్రాలకు వెళ్లి ప్యూరిటీ తనిఖీ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఏహెచ్సీ కేంద్రాలు ధ్రువ పత్రం ఇస్తాయి. దాని ప్రకారం పరిహారం కోరవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa