ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి నిమిషాల్లోనే రూ.5 కోట్ల వరకు లోన్..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాI ఛైర్మన్ ప్రకటన

business |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 10:01 PM

భారత్‌లోని డిజిటలీకరణ అనేది ఆర్థిక రంగం రూపు రేఖలను మార్చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లోన్స్ అందుతున్నాయని గుర్తు చేశారు. డిజిటల్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చిన క్రమంలో 25 నిమిషాల్లోనే ఎస్ఎంఈలకు రూ.5 కోట్ల వరకు రుణాల జారీకి ఆమోదం లభిస్తోందని తెలిపారు. ఇది గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో జరుగుతోన్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎస్‌బీఐ తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు.


డిజిటలీకరణ కారణంగా ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ ఉత్పత్తుల వినియగోం భారీగా పెరిగిందన్నారు ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి . అలాగే యూపీఐ ద్వారా అందించే రుణాల విషయంలో బ్యాంకులు తమ కలెక్షన్ సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉందన్నారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ద్వారానే 15 కోట్ల జన్‌ధన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరిచినట్లు చెప్పారు. అందులో 99.5 శాతం అకౌంట్లలో నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం సగటున రూ.4 వేల చొప్పున ఒక్క జన్‌ధన్ ఖాతాలో బ్యాలెన్స్ ఉందన్నారు. ఈ అకౌంట్ల ద్వారా రోజుకు 35 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఈ అకౌంట్లలో 56 శాతం మహిళలవే ఉన్నట్లు పేర్కొన్నారు.


చాలా మంది జీరో బ్యాలెన్స్ అకౌంట్లతో మొదలై ఇప్పుడు కరెంట్ ఖాతాలు తెరిచే స్థాయికి చేరుకున్నట్లు శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. అంతగా బ్యాంకింగ్ వ్యవస్థలు ప్రజల నిత్య జీవితాల్లో భాగమైపోయాయన్నారు. త్వరలోనే తమ ఎస్‌బీఐ యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. ఇందు కోసం 12 ఫిన్‌టెక్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నామని గుర్తు చేశారు. మొబైల్ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా మరిన్ని సేవలను అతి త్వరాలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. యోనో యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఒకప్పుడు గంటకు పైగా సమయం పట్టేదని కానీ, ఇప్పుడు 15 నిమిషాల్లోనే పూర్తవుతున్నట్లు తెలిపారు. కేవైసీ రూల్స్ మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయం వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థలను స్టేట్ బ్యాంక్ సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa