ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు ఎస్‌బీఐI గుడ్‌న్యూస్.. 30 శాతం వారికే

business |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:34 PM

దేశంలోని అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంక్ సిబ్బందిలో లింగ వైవిధ్యాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. మహిళలకు శుభవార్త చెబుతూ వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొంది. ఉద్యోగుల్లో మహిళల వాటాను 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. బ్యాంక్ లింగ వైవిధ్యం కోసం చేపడుతున్న నిర్ణయాల గురించి తెలుసుకుందాం.


ఎస్‌బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్), చీఫ్ డెవలప్మెంట్ అధికారి కిశోర్ కుమార్ పొలుదాసు కీలక విషయాలు వెల్లడించారు. 'ప్రస్తుతం ఫ్రంట్ లైన్ ఉద్యోగుల్లో సుమారు 33 శాతం మంది మహిళలు ఉన్నారు. బ్యాంకులో మొత్తం సిబ్బంది 2.40 లక్షలు ఉండగా వీరిలో మహిళల వాటా 27 శాతంగా ఉంది. భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 30 శాతం మేర ఉండాలన్న లక్ష్యం కోసం బ్యాంకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది ఎస్‌బీఐ' అని కిశోర్ కుమారు తెలిపారు.


తమ సంస్థలో మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు కిశోర్ కుమార్ తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాల్లో, ఎస్‌బీఐ నాయకత్వ నిర్ణయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ వృత్తి వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత, పనిలో గౌరవం ఉండేలా వాతావరణాన్ని కల్పిస్తూ ముందుగు వెళ్తామని తెలిపారు. మహిళా ఉద్యోగుల కోసం క్రెష్ అలవెన్సులు, ఫ్యామిలీ కనెక్ట్ ప్రోగ్రాములు, మాతృత్వ సెలువుల వంటివి కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళా ఉద్యోగుల కోసం అవసరమైన శిక్షణా కార్యక్రామాలు సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపవర్ హర్ అనే కార్యక్రమం ద్వారా మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, భవిష్యత్తులో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు పెరిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.


 రొమ్ము, గర్భాశయ కాన్యర్ పరీక్షలు, పోషక ఆహార అలవెన్సులు, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వంటివి చేపట్టేందుకు సైతం బ్యాంక్ దృష్టి సారించినట్లు కిశోర్ కుమార్ తెలిపారు. వీటి ద్వారా మహిళా ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిపైనా అప్రమత్తంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పెంచడంతో పాటు వారికి అవసరమైన అన్ని చర్యలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తీసుకునేందుకు సిద్దంగా ఉందన్నారు. ఇప్పటికే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చాలా వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa