అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంపు సంచలన నిర్ణయం విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థలు ఆందోళనలో పడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కే. కృతివాసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సంవత్సరం హెచ్1బీ వీసా కింద అమెరికాలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి తమ సంస్థలో కొత్త అవకాశాలు ఇవ్వనన్నారు. ప్రస్తుతం టీసీఎస్ అమెరికాలో సుమారు 32 వేల నుంచి 33 వేల వరకు ఉద్యోగులు ఉన్నారని, అందులో 11 వేల మంది హెచ్1బీ వీసా ఆధారిత ఉద్యోగులని ఆయన వెల్లడించారు. ఇక ఈ సంవత్సరం భారత్ నుండి సుమారు 500 మంది హెచ్1బీ వీసాలతో అమెరికాకు పంపించారు. అయితే ఇకపై కొత్త హెచ్1బీ ఉద్యోగులను నియమించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా స్థానిక అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని కూడా పేర్కొన్నారు.కృతివాసన్ భవిష్యత్తులో హెచ్1బీ వీసా ఉద్యోగులపై ఆధారాన్ని తగ్గించుకోవడం టీసీఎస్ యొక్క వ్యూహమని తెలిపారు. ఇటీవల రెండు శాతం ఉద్యోగులను తొలగించిన విషయంలో ఆయన స్పందిస్తూ, అది వ్యాపార అవసరాలకే సంబంధించిన నిర్ణయం అని, బాధితులకు తగిన వేతనాల పంపిణీ చేసినట్లు తెలిపారు.ఇలాంటి పరిస్థితి అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఆశిస్తున్న విదేశీ విద్యార్థులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 55 మంది హెచ్1బీ ఉద్యోగులను నియమించిన టీసీఎస్, ఇకపై కొత్త నియామకాలను నిలిపివేస్తోంది. దీంతో అమెరికాలో ఉద్యోగాలు కలగాలని కలలు కంటున్న అనేక మంది యువతకు ఇది పెద్ద అవమానంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa