ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకి ప్రభుత్వం ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 01:23 PM

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీలను కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముసడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, ఎం.బి.వారా, కిల్తంపాలెం గ్రామాల్లో 1,166.43 ఎకరాల విస్తీర్ణంలో రూ.531.36 కోట్ల పెట్టుబడితో మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌ను అభివృద్ధి చేసి, 45వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జేఎ్‌సడబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లిమిటెడ్‌ యాజమాన్యం ప్రతిపాదనలు సమర్పించింది. ఏపీ ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కుల పాలసీ 4.0 కింద జేఎ్‌సడబ్ల్యు మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అల్యూమినియం రిఫైనరీ కాంప్లెక్స్‌ నుంచి ఎంఎస్ఎంఈ పార్క్‌, ఇతర పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన 985.70 ఎకరాల భూమిలోకి కార్యకలాపాలను మార్చడానికి జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీ పేరును జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లిమిటెడ్‌గా మార్చడానికి అంగీకరించింది. ప్రైవేట్‌ పార్క్స్‌ పాలసీ మార్గదర్శకాల ప్రకారం ఎకరానికి రూ.3లక్షల మూలధన రాయితీ చెల్లిస్తారు. వీఎంఆర్‌డీఏ ద్వారా లే-అవుట్‌ ఆప్రూవల్స్‌, ల్యాండ్‌ కన్వర్షన్‌ చార్జీల పూర్తి మినహాయింపు తదితర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa