ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక ఆవేదనతో పిల్లలని చంపి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 03:15 PM

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను హత్య చేసి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హృదయవిదారక సంఘటన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో పావులూరి కామరాజు (35), కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (7) విగతజీవులుగా పడి ఉన్నారని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు.కామరాజు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ గా పనిచేశారని పోలీసులు తెలిపారు. 2020లో ఆయన అర్ధాంగి ఆత్మహత్య చేసుకోవడంతో, అప్పటి నుంచి ఇద్దరు కుమారులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో మానసిక ఆవేదనకు గురై ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa