మాటలు కూడా స్పష్టంగా పలకలేని వయసులో ఓ తెలుగు చిన్నారి అద్భుతం సృష్టించింది. కేవలం 22 నెలల వయసులోనే పెద్దలు సైతం చెప్పడానికి తడబడే సంస్కృత శ్లోకాలను అలవోకగా పఠించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన చిన్నారి పేరు మయూరి. అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించినందుకుగానూ ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో తన పేరును లిఖించుకుంది.శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన సీర సంజీవ్, డాక్టర్ వడిశ శాంతి దంపతుల కుమార్తె మయూరి. వృత్తిరీత్యా ఈ కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోంది. సాధారణంగా ఈ వయసు పిల్లలు ఆటపాటలతో గడుపుతుంటారు. కానీ మయూరి చిన్నప్పటి నుంచే శ్లోకాలు, పద్యాలపై ప్రత్యేక ఆసక్తి చూపించేది. ఆమెలోని ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు, ఆ చిన్నారికి శ్లోకాల పఠనంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మయూరి ఏకంగా 15 సంస్కృత శ్లోకాలను స్పష్టంగా పఠించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నిర్వాహకులు ఆమెను సత్కరించారు. దీంతో పాటు ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా మయూరి పేరు నమోదైంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన ధ్రువపత్రాలను నిర్వాహకులు ఇటీవల చిన్నారికి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa