ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 02:27 PM

దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరవు భత్యం లో ఒక విడతను విడుదల చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచారు. ఈ పెంపుదల 2024 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64 శాతం కరవు సహాయం  పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకాయిలలో ఒకదానిని విడుదల చేస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ పండగ సమయంలో ఈ డీఏను మంజూరు చేయడం గమనార్హం. పెంచిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa