ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14న విశాఖకు ఉప రాష్ట్ర‌ప‌తి రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:00 PM

ఈ నెల 14వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి సి. పి. రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఉదయం 8. 30 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖ చేరుకున్న తరువాత, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు వెళతారు. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ఉదయం 8. 55 గంటలకు ప్రారంభమయ్యే 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. అదే రోజు ఉదయం 11. 15 గంటలకు ఐఎన్ఎస్ డేగ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa