ముంబై సమీపంలోని బడ్లాపూర్లో ఓ సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ మహిళా నేత నీర్జా ఆంబేకర్ను ఆమె భర్త రూపేశ్ ఆంబేకరే, ముగ్గురు సహచరులతో కలిసి విష సర్పంతో కాటేయించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో పాము కాటుతో మరణించినట్లు భావించిన ఈ కేసు, మూడేళ్ల తర్వాత మరో హత్యాయత్నం కేసులో నిందితుడిని విచారించగా, ఈ కుట్ర బయటపడింది. భర్త సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నీర్జా మృతదేహానికి పోస్టుమార్టం జరగకపోవడంతో కేసును అప్పట్లో మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa