ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌లో ఎన్నికల్లో ఓవైసీ హవా,,,,మళ్లీ అవే సీట్లలో విజయం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 08:56 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అంచనాలకు మించి సీట్లు గెలిచింది. మరోవైపు, ఇండియా కూటమి బొక్కబోర్లా పడింది. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన అంచనాలు కూడా అందుకోలేకపోయింది. అయితే బిహార్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ–ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) హవా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు నాన్ ముస్లింలతో పాటు 25 స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపారు. ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో గట్టి పోటీని ఇచ్చిన ఎంఐఎం.. ఐదు సీట్లు గెలిచింది.


కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పలు స్థానాల్లో అధిక్యంలో కొనసాగిన ఎంఐఎం.. జోకిహట్‌, బహదుర్‌గంజ్‌, కొఛాధమన్‌, అమౌర్‌, బైసీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గణనీయమైన మెజారిటీలతో గెలవడం విశేషం. 2020 అసెంబ్లీ ఎన్నిక్లలో కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. ఐదు స్థానాలు గెలిచింది. ఇప్పుడు అవే ఐదు స్థానాల్లో అధికారం నిలుపుకుంది. అయితే, 2022లో అమౌర్ ఎమ్మెల్యే మినహా మిగతా నలుగురు ఎమ్మెల్యేలు.. ఆర్జేడీలోకి వెళ్లడం గమనార్హం


బీహార్‌లో ఎన్డీఏ– మహాగఠబంధన్‌ల మధ్య కీలక పోరు నడిచింది. అయితే తాజా ఫలితాలతో మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో.. ఎంఐఎం ప్రభావం మరింత పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయాలు పార్టీకి భవిష్యత్తులో బీహార్ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. బిహార్‌లో ఎంఐఎం మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎంఐఎం మంచి ప్రదర్శన కనబర్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఓవైసీ రియాక్షన్..


బిహార్ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తమ పార్టీకి ఓటు వేసినందుకు బీహార్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలిపారు. ఆ 5 స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులకు, పార్టీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. "బీహార్ ప్రజల ఆదేశాన్ని మేము అంగీకరిస్తున్నాము. సీఎం నితీశ్ కుమార్‌కు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీహార్ లోనే కాకుండా సీమాంచల్‌లో కూడా అభివృద్ధి తీసుకురావడానికి మా పార్టీ కృషి చేస్తుంది. అక్కడి ప్రజల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తాం. సీమాంచల్ సంక్షేమం కోసం మేము కృషి చేస్తాము" అని ఆయన అన్నారు. అంతేకాకుండా తేజశ్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ.. బీజేపీని ఆపలేదని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa