ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు.. కేంద్రం కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:38 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు తేదీ ఖరారు చేసింది. 2025, నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ 21 విడత కింద.. ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. లబ్ధిదారులైన ఒక్కో రైతు అకౌంట్లోకి రూ. 2 వేల చొప్పున పడనున్నాయి. మొత్తం 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ డబ్బులు దీపావళి పండగ సమయంలోనే వస్తాయని అంతా భావించారు. దీపావళి పండక్కి ముందే రైతులకు కేంద్రం శుభవార్త అందిస్తుందని పలు ఆంగ్ల మీడియాల్లోనూ కథనాలు కూడా వచ్చాయి. కానీ అది జరగలేదు. మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు తేదీ ఖరారు కావడంతో రైతులకు తీపికబురు అందిందని చెప్పొచ్చు.


ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే కచ్చితంగా లబ్ధిదారులు.. ఇ- కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట. లేకపోతే దాదాపుగా డబ్బులు పడవనే తెలుసుకోవాలి. ఇ- కేవైసీ పూర్తి చేసేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అయితే.. బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో.. ఓటీపీ ద్వారా కేవైసీ చేయొచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్‌లో.. ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయొచ్చు.


>> ఈ పథకం విషయానికి వస్తే.. పంట పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేలు వేస్తుంది కేంద్రం. దీనిని ఒకేసారి కాకుండా.. 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున అందిస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో అందజేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీనే ప్రతి విడతలోనూ విడుదల చేస్తుంటారు. చివరిసారి 20వ విడత నిధులు ఆగస్ట్ 2న వారణాసిలో ప్రధాని విడుదల చేశారు. 2025-26 ఏప్రిల్- జులై సమయంలో 9,71,41,402 మంది అకౌంట్లలో డబ్బులు వేసింది కేంద్రం.


మొత్తంగా 20 విడతల కింద 11 కోట్ల మంది రైతుల అకౌంట్లలో మొత్తంగా రూ. 3.70 లక్షల కోట్లకుపైగా డబ్బుల్ని జమ చేసింది. 2019, ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని ప్రారంభించింది. బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. పీఎం పోర్టల్‌లో రైతుల ల్యాండ్ డీటెయిల్స్ రికార్డ్ అయి ఉండాలి. ఇప్పటికే వరదల నేపథ్యంలో.. ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని లబ్ధిదారులకు 21వ విడత నిధుల్ని విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa