టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గూండాయిజం, రౌడీయిజానికి ఎవరూ భయపడరని వైయస్ఆర్సీపీ హిందూపురం సమన్వయకర్త.టి.ఎన్. దీపిక హెచ్చరించారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ గూండాలు వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంపై చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..`మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాదు అందులో ఉన్న దేవుడి విగ్రహాన్ని, భక్త కనకదాస ఫోటోలు కూడా ధ్వంసం చేశారు. అయన మాట్లాడుతూ... దేవుడనే భయం కూడా లేదు. వేణు రెడ్డి గారు కార్యాలయం నుంచి వెళ్ళిపోయారని తెలుసుకుని ఇలా చేశారు.మా పార్టీ బూత్ కమిటీ లీడర్ లోకేష్ షర్ట్ చించేశారు, పైగా అతన్ని చంపుతామని బెదిరించారు.సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఇదంతా చేశారు.బాలకృష్ణ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా.మీ గూండాయిజంకు, రౌడీ ఇజం కు ఎవరూ భయపడరు.మేం ప్రజా సమస్యలపై నిలదీస్తే మీరు తట్టుకోలేరా.మీ దాడులకు భయపడం, బెదరం, ఇంకా పోరాడతాం.జగన్ గారు శాంతియుతంగా వెళ్ళమని చెప్పారు కాబట్టి మా ప్రభుత్వంలో ఎలాంటి దాడులు జరగలేదు.బాలకృష్ణ గారు మీ బెదిరింపులకు వైయస్ఆర్సీపీ వారెవరూ భయపడరు, గుర్తుపెట్టుకోండి.మాది ప్రజల తరుపున పోరాటం, ఇది ఆగదు, ప్రశ్నిస్తూనే ఉంటాం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa