టెక్నాలజీ మన జీవితంలో అంతర్భాగంగా మారిన ఈ రోజుల్లో, ఆరోగ్యంపై శ్రద్ధ కూడా అదే స్థాయిలో పెరిగింది. మన ఫిట్నెస్ను, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు స్మార్ట్వాచ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాంటి వారి కోసమే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 'ఫిట్నెస్ కార్నివాల్' పేరుతో ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది. నవంబర్ 14న ప్రారంభమైన ఈ సేల్, నేటితో ముగియనుంది. ఈ సేల్లో భాగంగా ఆపిల్, సామ్సంగ్, గార్మిన్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్వాచ్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లను అందిస్తోంది.ఈ ఆఫర్లకు అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ప్రత్యేక తగ్గింపులు, 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం, పాత డివైజ్ల ఎక్స్చేంజ్పై అదనంగా రూ.300 వరకు డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ECG, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, జీపీఎస్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్వాచ్లు మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa