ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉంటామని, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామి ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఉత్తరాంధ్రా ప్రజలకు, ఉక్కు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేరాఫ్ అడ్రస్ అని.. కేవలం తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇది ముమ్మూటికీ ఉత్తరాంధ్రాకు తీరని ద్రోహమని.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు అట్టర్ ప్లాప్ కావడంతో... చంద్రబాబు ఆ కోపాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులపై చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఉత్తరాంధ్రాలో ఖరీదైన భూములను ఇప్పటికే తమ వారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు కన్ను.. ఇప్పుడు లక్షల కోట్ల ఖరీదైన స్టీల్ ప్లాంట్ భూములపై పడిందని... అందుకే ప్రైవేటీకరణకు మద్ధతిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా... వైయస్.జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ పోరాటం చేస్తుందని కే కే రాజు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa