ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ వినియోగంపై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 04:45 PM

ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించిన తీరు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది.ప్రతి సంస్థ తమ ఏఐ సామర్థ్యాలను స్వతంత్రంగా నిర్మించుకోవాలని సత్య నాదెళ్ల తన పోస్ట్‌లో సూచించారు. టెక్ పరిశ్రమ ‘జీరో సమ్ గేమ్’గా మారకూడదని ఆయన హెచ్చరించారు. ఏఐ ఫలితాలు అందరికీ చేరాలంటే, ప్రతి కంపెనీ తన సొంత ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని, లేనిపక్షంలో మొత్తం ఆర్థిక ప్రయోజనం కేవలం కొన్ని టెక్ దిగ్గజాలకే పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఒక వేదికపై పనిచేసే కంపెనీలు సృష్టించే ఆర్థిక విలువ, ఆ వేదికను తయారుచేసిన సంస్థ విలువ కంటే ఎక్కువగా ఉండాలన్న బిల్ గేట్స్ మాటలను నాదెళ్ల గుర్తుచేశారు. ఓపెన్‌ఏఐ, ఎన్విడియా, ఏఎండీ వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ కోవలోకే వస్తుందని ఆయన వివరించారు. కంపెనీలు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ ఏఐని నిర్మించుకోవాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa