ఢిల్లీ రోహిణిలోని మంగళం ప్యాలెస్ మాల్ క్రిస్టల్ బ్యూటీ స్పాలో స్పా సెంటర్ ముసుగులో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలు కావాలంటే గంటకు రూ. 7500 చెల్లించాలంటూ ఫోన్ ద్వారా విటులకు వల వేస్తున్న ఈ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆరుగురు మైనర్ బాలికలు, ఐదుగురు మహిళలను పోలీసులు రక్షించారు. స్పా సెంటర్లో పని ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్న తర్వాత వారిని బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించుతున్నట్లు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa