బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) కీలక తీర్పును ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినట్లు నమోదైన కేసులో హసీనాకు మరణశిక్షను విధిస్తూ ట్రైబ్యునల్ సంచలన నిర్ణయం తీసుకుంది.గత ఏడాది ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో హసీనా అక్కడి నుంచి తప్పించుకుని భారత్లోకి ఆశ్రయం కోరారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. ఇదే సమయంలో మానవత్వ వ్యతిరేక నేరాలకు సంబంధించిన పలు అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి.ఆందోళనల సమయంలో జరిగిన హింసలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తన ఫిబ్రవరి నివేదికలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో హసీనాకు మరణదండన విధించాలంటూ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం ప్రత్యేక వాదనలు వినిపించారు.తాజాగా, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఈ కేసులో తీర్పు వెలువరించి—షేక్ హసీనాకు మరణశిక్ష ఖరారు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa