ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు సంబంధించిన నకిలీ సిఫారసు లేఖలు జారీ కావడం కలకలం రేపింది. ఈ మోసంపై మంత్రి కార్యాలయం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా మంత్రి సత్యకుమార్ పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ సిఫారసు లేఖలను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ లేఖల ద్వారా మోసపోయిన కొందరు బాధితులు నేరుగా మంత్రి కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.విషయం తీవ్రతను గుర్తించిన మంత్రి పర్సనల్ అసిస్టెంట్ వెంటనే స్పందించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన కమిషనర్, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో, టీటీడీ సిఫారసు లేఖల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి భక్తులు మోసపోవద్దని మంత్రి కార్యాలయం సూచించింది. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa