ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకామణి చోరీ కేసులో సాక్షులందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 04:37 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన టీటీడీ మాజీ సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... కేసులోని నిందితులు, సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్‌తో పాటు ఇతర సాక్షులందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.పరకామణి చోరీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే కొన్ని రోజుల క్రితం సతీశ్ కుమార్ మరణించడం తీవ్ర కలకలం రేపింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఆ తర్వాత హత్య కేసుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa