రెండు నెలల కిందట ఓ యువతికి వివాహం కాగా.. ఆమెకు కడుపునొప్పి రావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్తకు ఊహించని షాక్ తగిలింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె 8వ నెల గర్భవతి అని చెప్పడంతో సదరు భర్త నిర్ఘాంతపోయాడు. విస్మయానికి గురిచేసే ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కురింజిపాడి సమీపంలో ఓ గ్రామానికి చెందిన యువతి (18)కి వైలమూర్కు చెందిన 25 ఏళ్ల యువకుడితో రెండు నెలల కిందట వివాహమైంది. సెప్టెంబరు 4న ఈ వివాహం జరగ్గా... రెండు రోజుల కిందట యువతికి కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె భర్త దగ్గరలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాడు.
ఆమెను పరీక్షించిన వైద్యులు.. యువతి ఎనిమిదో నెల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యులు చెప్పిన మాటలతో యువకుడి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇది కలా? నిజమా? అని ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ షాక్లోని నుంచి తెరుకున్న భర్త.. భార్య గర్భానికి కారణమైన వ్యక్తి ఎవరు? అని తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నైవేలి మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అతడెవరో తెలిసింది.
ఆమె మేనమామ అయిన లింగముత్తు (32) కారణంగా గర్బం దాల్చినట్టు గుర్తించారు. మూర్ఛరోగి అయిన అతడు తన అక్క ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలోనే తన మేనకోడలితో సన్నిహితంగా ఉంటూ ఆమెను లొంగదీసుకుని పలుసార్లు అత్యాచారానికి పాల్పడి.. గర్భవతిని చేసినట్టు పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడు లింగముత్తుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కానీ, ఇక్కడ కేసు మరో మలుపు తిరిగింది. 3 నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లింగమూర్తి కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోమాలోనే ఉండటం గమనార్హం. కాగా, గతంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa