ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’ స్కీమ్ రెండో విడత నిధులు ఒకేసారి విడుదల కానున్నాయి. రెండు పథకాలు కలిపి ప్రతి రైతుకు రూ.7 వేలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈ రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ వాటా రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతులకు అందనుంది. గతేడాది మొదటి విడతలో రూ.6 వేలు (కేంద్రం రూ.2వేలు + రాష్ట్రం రూ.4వేలు) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర వాటా మరో వెయ్యి రూపాయలు పెంచడం రైతులను ఆనందంలో ముంచెత్తింది.
కడప జిల్లాలోని కమలాపురంలో ఈ నెల 19న ఘనంగా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,62,904 మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి మొత్తం రూ.3,077 కోట్లు ఒకేసారి జమ కానుండడం ఇప్పటివరకు ఏపీలో అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కార్యక్రమంగా నిలవనుంది.
రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కారు.. పీఎం కిసాన్ను మరింత బలపరుస్తూ, రాష్ట్రం నుంచి అదనంగా రూ.5 వేలు ఇవ్వడం ద్వారా దేశంలోనే అత్యధిక సాయం అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. ఈ డబ్బు రైతుల చేతికి అందగానే రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొత్త ఉత్సాహం నింపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa