ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు తుది దశకు చేరుకుంటున్నాయి

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 01:40 PM

భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా కుదిరిన వెంటనే శుభవార్త వెలువడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఒప్పందంలో భారత రైతులు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని గోయల్ స్పష్టం చేశారు. "మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన, సమానమైన పరిష్కారం లభించినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి. అప్పుడు మీరు శుభవార్త వింటారు" అని ఆయన వివరించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఆరు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయని గోయల్ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి వంటి దీర్ఘకాలిక ఒప్పందాలు భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని అన్నారు. ఈ స్నేహం శాశ్వతంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa