ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోస్ మరియు భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 01:48 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి తుపాకుల మోత మోగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా విజయవాడలో ధ్రువీకరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, వారిని ఏరివేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు.నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురిని మట్టుబెట్టినట్లు డీజీ వివరించారు. హిడ్మా ఎదురుకాల్పుల్లోనే మరణించారని, ఆయన్ను పట్టుకుని చంపారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa