గతవారందేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు వెనక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో నేరుగా పాక్ పాత్రను ఆ దేశానికి చెందిన రాజకీయ నేత ధ్రువీకరించడం సంచలనంగా మారింది. రెండు రోజుల కిందట వరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రధానిగా ఉన్న పాక్ నేత చౌధురి అన్వరుల్ హక్ ఢిల్లీ పేలుడులో తమ పాత్ర ఉందని చెప్పడం గమనార్హం. హక్ పీఓకే అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘మీరు (భారత్) బలూచిస్థాన్లో రక్తపాతం కొనసాగిస్తే, మేము ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు మిమ్మల్ని దెబ్బతీస్తామని నేను ముందే చెప్పాను… అల్లాహ్ కృపతో అది చేశాం… మా వీరులు చేశారు’’ అని అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, దాయాది రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఎప్పటిలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్తో ‘పూర్తిస్థాయి యుద్ధం’ అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నామని పాక్ ప్రకటించింది. ఢిల్లీ పేలుడు తర్వాత పరిణామాలపైజమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే, బలూచిస్థాన్లో వేర్పాటువాద ఉద్యమం వెనుక భారత్ ఉందని పాక్ పదేపదే చేస్తోన్న ఆరోపణలను న్యూఢిల్లీ ఖండిస్తోంది. అంతేకాదు, పాక్ సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ప్రపంచ దృష్టి మళ్లించే ప్రయత్నమని తిప్పికొడుతోంది. బలూచ్లో జరిగే హింసకు తమకు ఏమాత్రం సంబంధం లేదని తిప్పికొడుతోంది. కాగా, ఎర్రకోట వద్ద కారు పేలుడులో పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు నిర్దారించాయి.
కాగా, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను జైషే ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలున్న జమ్మూ కశ్మీర్లోని షోపియాన్కు చెందిన మతపెద్ద మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ నెలకొల్పి, ఉగ్రవాదులతో తరుచూ సమావేశాలను ఏర్పాటుచేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. దీనికి అహ్మద్తో పాటు పాకిస్థాన్ ఉగ్రవాది ఉమర్ బిన్ ఖట్టాబ్ అలియాస్ హంజుల్లాహ్ హ్యాండర్లుగా వ్యవహరించినట్టు పేర్కొన్నారు. ఎర్రకోట పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ బిన్ కూడా హర్యానాలోని ఫరీదాబాద్లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యులను గుర్తించి, ఉగ్రవాదంవైపు మళ్లించాడు.ఈ కేసులో ఇప్పటి వరకూ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిలో లేడీ డాక్టర్ షహీన్ సయ్యద్.. జైషే మహిళా విభాగం భారత్ చీఫ్గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ఆమె కారులోనే భారీగా అమ్మోనియం నైట్రేట్, రైఫిల్ సహా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa