ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అన్యమత చిహ్నంతో వాహనం.. కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 08:10 PM

తిరుమలలో గురువారం ఉదయం అన్యమత చిహ్నంతో ఉన్న వాహనాన్ని గమనించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వాహనాన్ని గుర్తించి, స్టిక్కర్‌ను తొలగించారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ గోబి, వాహన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం 10.40 గంటలకు అలిపిరి చెక్‌పోస్టు ద్వారా వాహనం తిరుమలకు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa