ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఎల్లో మీడియాకి ఎందుకంత కడుపుమంట?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 11:43 AM

హైదరాబాద్ పర్యటనలో వైయస్.జగన్ కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమంట మొదలైందని... వెల్లువలా తరలివచ్చిన జనాలను చూసి ఓర్వలేకే టీడీపీ, ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ... లండన్ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు నిబంధన మేరకు వైయస్.జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటన వివరాలు ముందుగానే వెల్లడిస్తే.. దానిపైనా కూటమి నేతలు, ఎల్లో మీడియా విషపు రాతలతో చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. న్యాయస్ధానాల మీద వైయస్.జగన్ కు అపారమైన గౌరవం ఉందని.. అందులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరయ్యారన్న జూపూడి ప్రభాకరరావు... వెల్లువలా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బాబు పతనం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa