ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ లో పరాజయంతో ఇండియా కూటమిలో ప్రకంపనలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 01:27 PM

బీహార్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ‘ఇండియా’ కూటమిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వం, కూటమి అనుసరించిన వ్యూహాలపై భాగస్వామ్య పక్షాలు బాహాటంగానే ప్రశ్నలు సంధిస్తున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూటమి నుంచి వైదొలిగే అంశాన్ని కూడా పరిశీలిస్తుండటంతో కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.బీహార్ ఎన్నికలకు ముందే సీట్ల పంపకాల్లో తమను పక్కన పెట్టారని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరోపిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చింది. తమను కేవలం జూనియర్ భాగస్వాములుగా చూస్తున్నారని, సమాన గౌరవం ఇవ్వడం లేదని జేఎంఎం నేతలు విమర్శిస్తున్నారు.మరోవైపు, బీహార్ ఫలితాలు కూటమికి ఒక మేల్కొలుపు కావాలని శివసేన (యూబీటీ) వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే నష్టం జరిగిందని, మిత్రపక్షాలతో సరైన సమన్వయం లోపించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమిలో తీవ్రమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.ఇక, బీహార్‌లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయమే సరైందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పార్టీ సంస్థాగత విధానాలను ప్రక్షాళన చేయాలని, పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa