ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 01:34 PM

టీటీడీ అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారిన మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ధర్మకర్తల మండలి నడుం బిగించింది. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా కొనుగోళ్లు జరిపే ఈ కీలక విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠ‌మైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.గతంలో ఈ విభాగంలో జరిగిన అవకతవకలు, నాణ్యతలేని సరుకుల కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 350 విలువ చేసే శాలువాలను రూ. 1,300కు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే కొందరు సిబ్బందిని బదిలీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa