ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయన్మార్‌ నుండి విడుదలైన ఉద్యోగాల పేరుతో మోసపోయిన వ్యక్తులు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 02:58 PM

మయన్మార్‌లో సైబర్ నేరగాళ్ల ముఠాల చెరలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. అధిక జీతాలు వచ్చే ఉద్యోగాల పేరుతో మోసపోయిన వీరిని, భారత ప్రభుత్వం రక్షించి థాయ్‌లాండ్ మీదుగా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించింది. మొత్తం 370 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగా, వారిలో 55 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారు.బాధితులంతా విజయవాడ, విశాఖపట్నం నగరాలకు చెందిన వారని ఏపీ ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రభుత్వ అధికారులు వారిని ఏపీ భవన్ సిబ్బందికి అప్ప‌గించారు. వెంటనే వారిని ఏపీ భవన్‌కు తరలించి, తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. మయన్మార్‌లో నేరగాళ్లు వారి మొబైల్ ఫోన్లు, డబ్బు లాక్కోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది.అనంతరం రైల్వే అధికారులతో సమన్వయం చేసి, ఎమర్జెన్సీ కోటాలో టిక్కెట్లు ఖరారు చేశారు. వీరంతా ఈరోజు తమ స్వస్థలాలకు రైళ్లలో బయలుదేరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa