బంగ్లాదేశ్లో సంభవించిన భూకంపం పశ్చిమ బెంగాల్ను వణికించింది. ఈ ఉదయం కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.భారత కాలమానం ప్రకారం ఉదయం 10:08 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్లోని నర్సింగ్ది ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే భూకంపం రావడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది.ఈ ఆకస్మిక పరిణామంతో కోల్కతా, దాని శివారు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోయారు. అపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో ఉన్నవారు వెంటనే భవనాలను ఖాళీ చేసి సమీపంలోని ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. "నేను ఆఫీస్ కాన్ఫరెన్స్ కాల్లో ఉండగా అకస్మాత్తుగా సోఫా కదిలింది. కొన్ని క్షణాల్లోనే అది భూకంపమని అర్థమైంది. ఇంత బలమైన ప్రకంపనలు రావడం నా జీవితంలో ఇదే తొలిసారి" అని బారానగర్కు చెందిన ప్రియాంక చతుర్వేది తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa