ఆంధ్రప్రదేశ్లో రైతుల జీవితాలకు కొత్త దిశ చూపి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 'రైతన్నా.. మీకోసం' అనే బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, దాన్ని శాశ్వతంగా లాభసాటిగా మార్చడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత. కేవలం మాటలతో కాకుండా, ఇజ్రాయల్ టెక్నాలజీని అందించి ఉత్పత్తిని పెంచిన ఘనత ఆయనది. ఇప్పుడు అదే స్ఫూర్తితో వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని వివరించారు.గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. "జగన్ రెడ్డి పాలనలో విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతీ దశలోనూ రైతులను దగా చేశారు. ఆయన హయాంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. అమ్ముకున్న పంటకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిని సృష్టించారు. రైతు ద్రోహి అయిన జగన్ రెడ్డి ఎగ్గొట్టిన రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించింది. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ వంటి పథకాలను అటకెక్కించి రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టారు" అని ఆయన విమర్శించారు.రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం 'పంచ సూత్రాల'ను రూపొందించిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ సూత్రాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa