మన దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆభరణంగా ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని.. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల వేళ కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. బంగారు ఆభరణాలు.. మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. అందుకే దీనికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఇది ఆభరణంగానే కాకుండా.. సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా ఉంది. బంగారం ధరల్ని అంతర్జాతీయంగా, దేశీయంగా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. దీనికి తగ్గట్లుగానే పెరగడం లేదా తగ్గడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతుంటుంది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగితే.. ఇక్కడా దేశీయంగా పెరుగుతుంది. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతుందని చెప్పొచ్చు.
అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 50 శాతానికిపైగా ఎగబాకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటువైపు విస్తృతంగా పెట్టుబడులు పెరిగాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణమైంది. మళ్లీ తర్వాత.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బంగారం రేట్లు గరిష్ట స్థాయిల నుంచి దిగొచ్చాయి.
ఇవాళ మళ్లీ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తత పాటిస్తున్నారు. తాజాగా.. అమెరికా ఉద్యోగ మార్కెట్ నుంచి వచ్చిన బలమైన డేటా.. తారుమారు చేసింది. సెప్టెంబర్ నెలలో నాన్ ఫార్మ్ పే రోల్స్ అంచనాల్ని మించి పెరిగినట్లు యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అంచనాల్ని మించగా.. ఇక్కడ డిసెంబర్ సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు తగ్గాయి. ఇంకా బలమైన యూఎస్ జాబ్ మార్కెట్ నేపథ్యంలో.. డాలర్ ఇండెక్స్ 6 నెలల గరిష్ట స్థాయి అయిన 100 మార్కుపైకి చేరింది.
సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. బంగారం ధర తగ్గుతుంది. ఇప్పుడు అంచనాలు మారడం సహా డాలర్ పెరగడం వల్ల కూడా బంగారం ధర దిగొచ్చింది. ఈ కారణంతో దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో కూడా బంగారం ధర పతనమైంది. దేశీయంగా చూస్తే జోయాలుక్కాస్, ఖజానా, లలితా జువెల్లరీ లిమిటెడ్, మలబార్ వంటి వాటిల్లో గ్రాము బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 65 తగ్గింది. దీంతో గ్రాముకు రూ. 11,470 వద్ద ఉంది. టాటా ప్రొడక్ట్ తనిష్క్లో గోల్డ్ రేటు గ్రాముకు రూ. 11,510 గా ఉంది. గోల్డ్ రేట్లు.. అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ప్రాంతాల్ని బట్టి.. స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో తేడాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు.. తుది బిల్లుపై 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. మేకింగ్ ఛార్జీలపైనా 5 శాతం జీఎస్టీ పడుతుంది. ఇంకా.. మేకింగ్ ఛార్జీలు అనేవి షాపుల్ని బట్టి.. డిజైన్లను బట్టి వేర్వేరుగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa