జర్మనీ దేశం భారతీయ విద్యార్థులు మరియు నిపుణుల కోసం ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఆ దేశం ఏఐ, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది.ఈ సమస్యను పరిష్కరించేందుకు, జర్మనీ భారతీయ టాలెంట్ను ఆహ్వానిస్తూ వలస విధానాలు, వీసా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఇంజినీరింగ్, ఐటీ, హెల్త్కేర్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ చర్యలు తీసుకున్నాయి.ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ‘యూరోపియన్ బ్లూ కార్డ్’ కోసం అర్హతలను తగ్గించి, కొత్తగా ‘ఆపర్చునిటీ కార్డ్’ను ప్రవేశపెట్టారు. ఈ వ్యూహంలో టీయూ9 యూనివర్సిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. ఏఐ, రోబోటిక్స్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్ రంగాల ప్రత్యేక కోర్సుల ద్వారా విదేశీ విద్యార్థులను ఆకర్షించనున్నారు.బోర్డర్ప్లస్ సీఈఓ మయాంక్ కుమార్ మాట్లాడుతూ.. "జర్మనీ పారిశ్రామిక లక్ష్యాలు మరియు జనాభా సంక్షోభం కలిసి భారత యువతకు గొప్ప అవకాశాన్ని సృష్టించాయి" అన్నారు. నిపుణులు 2025లో ఉన్నత విద్య కోసం జర్మనీలోని స్టెమ్ కోర్సులు భారతీయ విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండే సూచనలు చేస్తున్నారు.అలాగే, టెర్న్ గ్రూప్ ఫౌండర్ అవినావ్ నిగమ్ తెలిపారు.. ప్రస్తుతం జర్మనీలో సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఇంకా లక్షలాది మంది రిటైర్ అవ్వనున్నారని చెప్పారు. ఇది తాత్కాలిక సమస్య కాకుండా దీర్ఘకాలిక అవసరమని స్పష్టం చేశారు. మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa