అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పనతో సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కీలక పాత్ర పోషించాల్సిందని సీఎం సూచించారు.సచివాలయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణుల బృందంతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో, వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పన, మెటీరియల్ సైన్స్ పరిశోధనలకు గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ ఏర్పాటు చేయాలని పరిశోధకులు వివరించారు. ఇది దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా రూపుదిద్దుకోవడం గమనార్హం.కేంద్రం ద్వారా వైద్య, ఔషధ, బయోసెన్సార్ అప్లికేషన్ల వంటి పరిశోధనలను ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఈ కేంద్రాన్ని IBM, TCS, L&T వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్తో కలిసి క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోవడం ద్వారా క్వాంటం ఎకోసిస్టమ్ అమరావతికి వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో ఏర్పాటు చేసిన ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి కేంద్రాలు విజయగాథలుగా మారినట్టు తెలిపారు.చంద్రబాబు నాయుడు, క్వాంటం రంగంలో ప్రస్తుతం ఉన్న ఆసక్తిని, పరిశోధనలకు అవసరమైన అవకాశాలను వాణిజ్య మరియు పరిశ్రమలతో కలిపి అమరావతిలో కొత్త వినూత్న ఆవిష్కరణలను తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయోఫౌండ్రీని ప్రత్యేకమైన, వినూత్న ఆలోచనగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa